
క్రీడలు

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా గోడ వద్ద తలదాచుకున్న వీధి వ్యాపారులపై ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న సహాయక బృందాలు స్థానికులతో కలిసి శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశాయి. బాధిత కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు.
మరోవైపు నగరంలో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. ఈదురుగాలులతో చెట్లు విరిగి పడటం, హోర్డింగ్లు కూలిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!