

టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్ల ధరలను సవరించింది. కొన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.11,000 వరకు ధరలు పెంచింది. ముఖ్యంగా ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోగా, కొత్త ఆర్బిటర్ సిరీస్ కూడా ఖరీదైంది. అలాగే జూపిటర్ 110, జూపిటర్ 125, ఎన్టార్క్ 125 మోడళ్ల ధరలను కూడా కంపెనీ పెంచింది.
టీవీఎస్ ఐక్యూబ్ 3.5kWh వేరియంట్ ధర రూ.1.33 లక్షల నుంచి రూ.1.42 లక్షలకు పెరగగా, బేస్ 2.2kWh మోడల్ ధర రూ.1.11 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు చేరింది. ఐక్యూబ్ ఎస్ (4.7kWh) ధర రూ.1.61 లక్షలకు, ఐక్యూబ్ ఎస్టీ (5.3kWh) ధర రూ.1.75 లక్షలకు పెరిగింది. అయితే 3.1kWh వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కొత్త ఆర్బిటర్ వి1 ధర రూ.88,250 నుంచి రూ.99,250కు, వి2 ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.14 లక్షలకు పెరిగింది.
పెట్రోల్ స్కూటర్లలో జూపిటర్ 110 ధరలు రూ.575 నుంచి రూ.1,950 వరకు, జూపిటర్ 125 ధరలు రూ.875 నుంచి రూ.2,410 వరకు పెరిగాయి. ఎన్టార్క్ 125 డిస్క్, రేస్ ఎడిషన్ వేరియంట్ల ధరలు కూడా రూ.850 చొప్పున పెరిగాయి. కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు బుకింగ్కు ముందు తాజా ఎక్స్షోరూమ్ ధరలను డీలర్ వద్ద నిర్ధారించుకోవాలని కంపెనీ సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!