
న్యూస్

మార్చి నెలలో భారత్ వస్తు ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు కూడా 6.51 శాతం తగ్గి 59.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల కనిపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా కీలక వాణిజ్య మార్గమైన హర్మూజ్ జలసంధిలో ఆటంకాలు ఏర్పడటంతో వాణిజ్యంపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. దీంతో మార్చి నెలలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లకు పెరిగింది.
అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్తు, సేవల ఎగుమతులు 4.22 శాతం పెరిగి 860 బిలియన్ డాలర్లకు చేరాయి. ముడిచమురు దిగుమతులు 35.91 శాతం తగ్గగా, బంగారం దిగుమతులు 31.63 శాతం తగ్గాయి. పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు ఘనంగా 57.95 శాతం పడిపోయాయని వాణిజ్య శాఖ తెలిపింది. అయినప్పటికీ ఇతర దేశాలకు ఎగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!