
జనరల్

స్విస్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గాయి. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 325 కోట్ల స్విస్ ఫ్రాంకులు (సుమారు రూ.36,793 కోట్లు)గా నమోదయ్యాయి. ఇది 2024తో పోలిస్తే 8 శాతం తగ్గుదలగా ఉంది.
అయితే వ్యక్తిగత, సంస్థాగత ఖాతాల్లోని నిధులు 50 శాతానికి పైగా పెరిగి 52.4 కోట్ల స్విస్ ఫ్రాంకులకు (సుమారు రూ.6,000 కోట్లు) చేరాయి. ఇది మొత్తం భారతీయ నిధుల్లో కేవలం 16 శాతం మాత్రమే. మిగతా మొత్తాలు బ్యాంకులకు చెల్లించాల్సినవి లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!