

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని తొలిసారిగా దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారత్ ఎయిర్టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత ఇది ఆరవ భారత లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. మార్కెట్ విలువ పరంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత రెండవ అతి పెద్ద బ్యాంక్గా, నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ను మూడో స్థానానికి నెట్టింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేరు మంగళవారం ఒక దశలో రూ.1,153.85 కు చేరి జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరగా 0.16% నష్టంతో రూ.1,144.10 వద్ద ముగిసింది. దీని తో సహా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.10.56 లక్షల కోట్లకు చేరింది.
ఈ నెలలో ఎస్బీఐ షేరు 6% పైగా పెరిగింది, జనవరిలో 10% పైగా ఎగబాకింది, గత ఏడాదిలో 67.5% వృద్ధి సాధించింది. దేశంలో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీకి ఎస్బీఐలో 9.23% వాటా ఉంది. షేర్ ధర పెరుగుదలతో ఎల్ఐసీ యొక్క ఈక్విటీ వాటా విలువ గత ఏడాదిలో దాదాపు రూ.40,000 కోట్లతో పెరిగి మొత్తం రూ.98,353 కోట్లకు చేరింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!