

దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంపీ డెవలపర్స్ తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించినట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యానికి ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉందని సంస్థ తెలిపింది. ఎంపీ డెవలపర్స్ ప్రస్థానం, సమంత సినీ ప్రయాణం రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతంతో ముడిపడి ఉండటం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తమ ప్రయాణంలో సమంత భాగస్వామ్యం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని సంస్థ పేర్కొంది.
2012లో ప్రారంభమైన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్లలో 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసి, 3,000కుపైగా కుటుంబాల నమ్మకాన్ని పొందినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో 15 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు ఇంటి కొనుగోలును దీర్ఘకాలిక పెట్టుబడిగా మార్చే లక్ష్యంతో ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే కొత్త కాన్సెప్ట్ను సంస్థ పరిచయం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!