
జనరల్

భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధిక డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ డివిడెండ్ ప్రభుత్వానికి భారీ సహాయం అందించనుంది.
గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆర్బీఐ రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఇది ఆంతకు ముందు సంవత్సరం చెల్లించిన రూ.2.11 లక్షల కోట్ల కంటే 27 శాతం ఎక్కువ. 2025-26 డివిడెండ్పై నిర్ణయం తీసుకోవడానికి ఆర్బీఐ బోర్డు సమావేశం ఈ నెలలో జరగనుంది.
బడ్జెట్ పత్రాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కేంద్రం రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్ను అంచనా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!