

2026-27 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. రిటర్నులు సమర్పించే ముందు పన్ను చెల్లింపుదారులు అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ఐటీ శాఖ సూచించింది. తప్పులు జరిగితే రిఫండ్ ఆలస్యం, నోటీసులు, పెనాల్టీలు, అదనపు పన్ను భారాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆదాయం స్వభావం, పరిమాణం ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారం ఎంచుకోవాలి. రూ.50 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారం ఉపయోగించవచ్చు. అయితే విదేశీ ఆదాయం లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేరే ఫారాలు అవసరం అవుతాయి. ప్రీ-ఫిల్డ్ డేటా, ఫారం 16, 26ఏఎస్, ఏఐఎస్ వివరాలతో తేడాలు ఉంటే నోటీసులు లేదా అదనపు పన్ను భారం తప్పదు.
పన్ను మినహాయింపు ఉన్న ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా వెల్లడించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలు క్రియాశీలంగా ఉండేలా చూసుకోవాలి. ఆలస్యం లేదా తప్పు ఫైలింగ్ వల్ల వడ్డీ, పెనాల్టీలు 200 శాతం వరకు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!