
సినిమాలు

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎంఐఏ) గురువారం అధికారికంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్బస్ ఏ320 విమానానికి వాటర్ క్యానన్స్తో స్వాగతం పలకడంతో విమానాశ్రయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. అదానీ గ్రూప్ సారథ్యంలో పనిచేస్తున్న ఎన్ఎంఐఏ నుంచి తొలి వాణిజ్య విమాన సర్వీస్ హైదరాబాద్కు బయలుదేరింది.
ప్రారంభ దశలో ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలకు కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్, స్టార్ ఎయిర్ వంటి ప్రముఖ విమాన సంస్థలు ఇక్కడి నుంచి తమ సర్వీసులను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!