

దిల్లీలో నిర్వహించిన “ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026”లో టెక్ పరిశ్రమ నిపుణులు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. కృత్రిమ మేధ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ఉద్యోగ భద్రత కోసం నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరమని సూచించారు. వచ్చే 3–5 సంవత్సరాల్లో ఏఐ వేగంగా మారుతుందని, అందుకు అనుగుణంగా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏఐ కొన్ని పాత ఉద్యోగాలను తగ్గించినా కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఉద్యోగులు తమ రంగంలో అవసరమైన ఏఐ టూల్స్ను గుర్తించి వాటిని నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. “కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని అనుకున్నారు, కానీ ఉత్పాదకత పెరిగింది” అని పరిశ్రమ నాయకులు గుర్తుచేశారు.
సదస్సులో భారత్లో అభివృద్ధి చేసిన ఏఐ, రోబోటిక్స్ టెక్నాలజీలు ఆరోగ్య సేవలు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయని వెల్లడించారు. అలాగే జియో అభివృద్ధి చేసిన పలు ఏఐ ప్లాట్ఫారమ్లను ప్రధాని నరేంద్రమోదీ పరిశీలించి, భారతీయ భాషలు, ఆరోగ్యం, విద్య రంగాల్లో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!