హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని నాలుగు రహదారి ప్రాజెక్టుల నుంచి వైదొలిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కేఎన్ఆర్ పళని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కేఎన్ఆర్ రామగిరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కేఎన్ఆర్ గురువాయుర్ ఇన్ఫ్రా లిమిటెడ్, కేఎన్ఆర్ రామనట్టుకర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే నాలుగు స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కంపెనీలను ఇండస్ ఇన్ఫ్రా ట్రస్ట్కు రూ.1,543.19 కోట్లకు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది.
ఈ మేరకు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయని తెలిపింది. ఈ నాలుగు ఎస్పీవీలకు సంబంధించిన రుణాలు కూడా ఇండస్ ఇన్ఫ్రా ట్రస్ట్కు బదిలీ కానున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెల్లడించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!