

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా “స్మార్ట్ సేవింగ్స్ ప్లాన్” ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ధర రూ.485 మాత్రమే కాగా, 72 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఈ విధంగా రోజుకు కేవలం రూ.6.74 ఖర్చుతోనే యూజర్లు ఈ సదుపాయాలను పొందవచ్చు. భారత టెలికాం రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన దీర్ఘకాల ప్లాన్లలో ఇది ఒకటిగా నిలిచింది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల తమ రీఛార్జ్ ధరలను పెంచిన నేపథ్యంలో, బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకు ప్లాన్లు ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే, కొంతమంది వినియోగదారులు నెట్వర్క్ సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కారమైతే, మరింత మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!