

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న భారత మదుపర్లకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఊహించని షాక్గా మారాయి. రాజకీయ స్థిరత్వం, దేశీయ వినియోగం, పన్ను సడలింపులు వంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య యుద్ధ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు మదుపర్ల సంపద సుమారు రూ.48.29 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇదే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 10 శాతం పైగా పడిపోయాయి. బంగారం ధరలు అస్థిరంగా మారగా, రూపాయి తాజా కనిష్ఠ స్థాయిలకు చేరింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వార్తలతో పాటు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 112 డాలర్లకు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, రూపాయి పతనం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.13.9 లక్షల కోట్లు తగ్గి రూ.415.21 లక్షల కోట్లకు పరిమితమైంది.
సెన్సెక్స్ 1,836 పాయింట్లు కోల్పోయి 72,696 వద్ద ముగియగా, నిఫ్టీ 601 పాయింట్లు పడిపోయి 22,512 స్థాయికి చేరింది. సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో ఎక్కువ శాతం షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. అయితే రాత్రి సమయానికి కొన్ని ఊరట సంకేతాలు కనిపించాయి. అమెరికా చర్యల నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టగా, అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!