

భారత్–ఈయూ (యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ప్రభావం దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమపై క్రమంగా స్పష్టమవుతోంది. ఈ ఒప్పందంతో బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, స్కోడా, లంబోర్ఘిని వంటి లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గుతాయనే అంచనాలు మొదట వినిపించాయి. అయితే, దిగుమతులపై సుంకాల తగ్గింపు కోటాలు, ధరల పరిమితులకు లోబడి మాత్రమే అమలవుతుందని తేలడంతో ఆ ఉత్సాహం కొంత తగ్గింది.
ప్రస్తుతం 40,000 డాలర్ల (సుమారు రూ.36.8 లక్షలు) వరకు ధర ఉన్న దిగుమతి కార్లపై 70 శాతం, అంతకుమించిన ధర ఉన్న కార్లపై 110 శాతం సుంకం ఉంది. భారత్–ఈయూ ఎఫ్టీఏ అమలుతో ఈ సుంకం మొదట 40 శాతానికి, ఆపై దశలవారీగా 10 శాతానికి తగ్గనుంది. దీంతో లగ్జరీ కార్లు చౌకగా లభిస్తాయనే ఆశలు పెరిగాయి. కానీ ప్రభుత్వం రెండు కీలక షరతులు విధించింది—ఈయూ నుంచి దిగుమతయ్యే కార్ల ధర కనీసం 15,000 యూరోలు (సుమారు రూ.16.5 లక్షలు) ఉండాలి, అలాగే వార్షిక దిగుమతులు 2.5 లక్షల యూనిట్లకు మించకూడదు. ఈ పరిమితి దాటితే మళ్లీ 110 శాతం సుంకం వర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో, భారత్లో ఇప్పటికే తయారీ యూనిట్లు కలిగిన మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, స్కోడా, ఆడి వంటి కంపెనీల అమ్మకాలకు లేదా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పెద్దగా ముప్పు ఉండదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ సంస్థలు ఇప్పటికే దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు అవసరమైన అనేక కాంపోనెంట్లను భారత్ నుంచే సమకూర్చుకుంటున్నాయి.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!