
జనరల్

హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) గ్రామీణ మార్కెట్లపై మరింత దృష్టి సారిస్తోంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో మొత్తం వాహన విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్ల వాటా 25.9 శాతానికి చేరుకుందని హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో డీలర్షిప్ నెట్వర్క్ను కూడా విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ కొత్తగా ప్రారంభించే ప్రతి 10 అవుట్లెట్లలో ఆరు గ్రామీణ మార్కెట్లలోనే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ మార్కెట్ చేరువను, వాహన విక్రయాలను మరింత బలోపేతం చేయడమే ఈ వ్యూహం లక్ష్యమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!