

హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో ఒకటిగా అవతరించింది. ఐటీ హబ్గానే కాకుండా మౌలిక సదుపాయాల కేంద్రంగా మారుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 2022లో 60.9 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యం 2025 నాటికి 151.4 మెగావాట్లకు పెరిగింది. మరో 1.9 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా, ఈ విషయంలో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. తక్కువ ఖర్చులు, భౌగోళిక భద్రత, జీపీయూ, లిక్విడ్ కూలింగ్ వంటి సాంకేతికతలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ వృద్ధికి కారణమయ్యాయి. ఎన్టిటి లిమిటెడ్, అదానీ కానెక్స్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
అంతర్జాతీయ సంస్థల రాకతో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరిగింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ను ప్రారంభించనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే మూడు జోన్లతో 46 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఒరాకిల్ కూడా కొత్త డేటా సెంటర్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణే, కోల్కతా వంటి నగరాల్లో మొత్తం సామర్థ్యం 1.6 గిగావాట్లను దాటింది. ఏఐ, క్లౌడ్ సేవలు, డేటా లోకలైజేషన్ విధానాల వల్ల ఈ రంగంలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!