

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫ్యాప్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడానికి, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పించడానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు.
వృద్ధి అనేది యాదృచ్ఛికంగా రావదని, భావి తరాల కోసం శాస్త్రీయ ప్రణాళిక అవసరమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యాల ప్రకారం ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. క్యూర్-ప్యూర్-రేర్ త్రిముఖ వ్యూహంతో నగరం నుంచి గ్రామం వరకు సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. ఏఐ, ఇండస్ట్రీ 5.0 నేపథ్యంలో ఎకోసిస్టమ్ల ప్రాధాన్యం పెరుగుతుందని పేర్కొంటూ, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!