
సినిమాలు

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇంధన ధరల పెంపు, తక్కువ వేతనాలను నిరసిస్తూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు గంటల పాటు విధులను బహిష్కరించనున్నారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (జీఐపీఎస్డబ్ల్యూయూ) ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ పార్టనర్లు ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.3 చొప్పున పెంచడంతో డ్రైవర్లు, డెలివరీ వర్కర్లపై ఆర్థిక భారం పెరిగింది. ఈ పెంపుతో సుమారు 1.2 కోట్ల గిగ్ వర్కర్లు నేరుగా ప్రభావితమవుతారని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. వర్కర్ల ఆదాయాలు తగ్గిపోవడం, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలపై గతంలోనూ నిరసనలు జరిగాయి. దీనికి ప్రతిగా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పనపై కేంద్రం ముసాయిదా నిబంధనలను విడుదల చేసిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!