
క్రీడలు

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో రోజుకు సగటున 2.2 టన్నుల గోల్డ్ అమ్మకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ గోల్డ్ కొనుగోళ్ల విలువ సుమారు రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు ఉంటోందని అంచనా. ఈ గణాంకాలు భారతీయులకు గోల్డ్పై ఉన్న మక్కువను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి ఏడాది భారత్లో దాదాపు 800 నుంచి 900 టన్నుల గోల్డ్ వినియోగంలోకి వస్తోందని నివేదిక వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం ఆభరణాల కొనుగోళ్లదేనని తెలిపింది. పెళ్లిళ్లు, సంప్రదాయాలు, పెట్టుబడుల పరంగా గోల్డ్కు భారతీయులు ఇప్పటికీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!