

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 2 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి సుమారు రూ.10 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ వాటాలు ప్రధానంగా సంస్థాగత మదుపర్లకు విక్రయించే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియ కోసం గోల్డ్మన్ శాక్స్, మోతీలాల్ ఓస్వాల్, బీఎన్పీ పరిబాస్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ వంటి సంస్థలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నాయి. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా 3.5 శాతం వాటా విక్రయించి రూ.21 వేల కోట్లు సమీకరించింది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ షేర్హోల్డింగ్ను 25 శాతానికి పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎల్ఐసీలో 96.5 శాతం వాటా ఉంది. ఈ తాజా వాటా విక్రయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!