
జనరల్

బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించనుంది. ఈ బైబ్యాక్లో భాగంగా సుమారు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.12,000 చొప్పున తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్ వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.
ఈ బైబ్యాక్ ప్రతిపాదనకు బజాజ్ ఆటో డైరెక్టర్ల బోర్డు మే 6న ఆమోదం తెలిపింది. అనంతరం మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. వాటాదారులకు విలువను పెంచడంతో పాటు అదనపు నగదు పంపిణీ లక్ష్యంతో ఈ బైబ్యాక్ చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!