

అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై కొత్త టారిఫ్ విధానాన్ని తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో, ఆగస్టు 1 నుంచి వచ్చే రెండేళ్ల పాటు జనరిక్ మందులపై సున్నా శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏడాది పాటు 100 శాతం, అనంతరం 200 శాతం టారిఫ్లు అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పెంచడం, విదేశీ కంపెనీలు అక్కడ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ విధానం అమల్లోకి వస్తే అమెరికాకు భారీగా జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2025లో భారత్ నుంచి అమెరికాకు సుమారు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఇతర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే జనరిక్ మందుల సరఫరాలో భారత కంపెనీల పాత్ర కీలకంగా ఉంది. భారీ టారిఫ్లను నివారించేందుకు కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!