

ఎయిరిండియా సంస్థ తమ ఉద్యోగులకు కుటుంబ సభ్యులతో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తూ ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ (ELT) పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో 14 ఉచిత టికెట్లు ఇస్తోంది. అయితే ఈ సౌకర్యాన్ని కొంతమంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు సంస్థ అంతర్గత విచారణలో వెల్లడైంది. మొత్తం 24,000 మంది ఉద్యోగుల్లో 4,000 మందికి పైగా సిబ్బంది తమ కుటుంబ సభ్యులు కాని వ్యక్తులను కుటుంబ సభ్యులుగా చూపించి ఉచిత టికెట్లపై విమానాల్లో తీసుకెళ్లినట్లు గుర్తించారు. అంతేకాకుండా, కొంతమంది ఉద్యోగులు ఈ ఉచిత టికెట్లను ఇతరులకు అధిక ధరకు విక్రయించినట్లు కూడా సంస్థకు సమాచారం అందింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విధమైన దుర్వినియోగం ఎక్కువగా జరిగినట్లు తేలడంతో, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎయిరిండియా సిద్ధమవుతోంది. మోసపూరితంగా ప్రయోజనాలు పొందిన వారి నుంచి డబ్బులు తిరిగి వసూలు చేయడంతో పాటు జరిమానాలు కూడా విధించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022 జనవరిలో టాటా గ్రూప్ సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత చేరిన కొంతమంది సిబ్బందే ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ELT నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు సమాచారం.
ఇక పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ఎయిరిండియా సిబ్బందికి పనివేళల నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వబడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ మినహాయింపును ఏప్రిల్ 30 వరకు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇరాన్, ఇరాక్ గగనతలాన్ని వినియోగించలేకపోవడంతో ఎయిరిండియా సంస్థ ఐరోపా మరియు అమెరికా మార్గాల్లో విమానాల కోసం ఈజిప్ట్ మార్గాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగిస్తోంది. దీంతో విమాన ప్రయాణ సమయాన్ని 1 గంట 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, అలాగే విమాన విధుల సమయాన్ని 1 గంట 45 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు పెంచినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!