

దేశంలో విక్రయించే కొత్త స్మార్ట్ఫోన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త మొబైల్ ఫోన్లో ‘సంచార్ సాథీ’ యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్గదర్శకాలు రాబోయే 90 రోజుల్లో అమల్లోకి రావచ్చని జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఈ యాప్ను మొబైల్ యూజర్లు డిసేబుల్ చేయడం లేదా అన్ఇన్స్టాల్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. మొబైల్ ఫోన్ దొంగతనం, నకిలీ IMEI, సైబర్ మోసాలు వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రత్యేకంగా సంచార్ సాథీ యాప్ అభివృద్ధి చేయబడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లు, ఈ యాప్ సాయంతో రాష్ట్ర పోలీసులచే గుర్తించబడి, యజమానులకు తిరిగి అందించబడ్డాయి. ఇప్పటివరకు ఆరోగ్య సేతు, డిజిలాకర్, ఉమంగ్ వంటి కొద్దిపాటి ప్రభుత్వ యాప్లు మాత్రమే ప్రీ-ఇన్స్టాల్ అయ్యేవి. అయితే అన్ని కొత్త ఫోన్లలో సంచార్ సాథీని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయడం, ప్రభుత్వ యాప్ల విషయంలో ఇంకా కఠినమైన నిబంధనలు చేరనున్నాయనే సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది.















కామెంట్స్ (3)
అభినందనీయం
Smart move!
Big move for mobile security in India.