

భారతీయ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు, పాలనా వ్యవహారాలు, కస్టమర్ సేవలు, నిర్ణయ ప్రక్రియల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని వేగంగా పెంచుతున్నట్లు క్వెస్కార్ప్ నివేదిక వెల్లడించింది. 3.5 లక్షల యాక్టివ్ ఉద్యోగ ప్రకటనల ఆధారంగా రూపొందించిన ఈ అధ్యయనం ప్రకారం, ఏఐ నియామకాలు ప్రయోగాత్మక దశ నుంచి అమలు దశకు మారుతున్నాయి. సంస్థలు ఇప్పుడు ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయడమే కాకుండా వాటిని వ్యాపార కార్యకలాపాల్లో సమర్థవంతంగా అమలు చేయగల నిపుణులను ఎక్కువగా కోరుకుంటున్నాయి.
ప్రస్తుతం భారత్లో సుమారు 9.2 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారని నివేదిక పేర్కొంది. వీరిలో 2.57 లక్షల మంది కోర్ ఏఐ రోల్స్లో, 6.63 లక్షల మంది ఏఐ-ఎంబెడెడ్ పాత్రల్లో పనిచేస్తున్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఏఐ ప్లాట్ఫారమ్లు, గవర్నెన్స్ వ్యవస్థల నిర్మాణంపై దృష్టి పెట్టగా, ఐటీ సేవల సంస్థలు క్లయింట్ ప్రాజెక్టుల్లో ఏఐ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోర్ ఏఐ నైపుణ్యాలకు భారీ డిమాండ్ కొనసాగుతుండగా, పరిశ్రమ అవసరాలకు తగిన నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!