
గాసిప్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా నేడు ముంబై వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ముంబై ఇండియన్స్ మహిళల జట్టు తో యూపీ వారియర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో యూపీ వారియర్స్ ఒక్క విజయం మాత్రమే సాధించగా, ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగుపడాలని ఆశిస్తోంది.
ఇక రాత్రి 7.30 గంటలకు డెల్హీ క్యాపిటల్స్ మహిళల జట్టు తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాప్లో కొనసాగుతున్న బెంగళూరు జట్టు మంచి జోరులో ఉంది. ఈ మ్యాచ్ కూడా అభిమానులకు ఆసక్తికరంగా మారనుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!