
.jpeg&w=3840&q=75)
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 11వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో ఆర్సీబీ వరసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి మంచి ఫామ్లో కొనసాగుతోంది.
టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో ఢిల్లీ టాప్ ఆర్డర్ కూలిపోయింది. కేవలం 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని ఓపెనర్ షెఫాలీ వర్మ (62) నిలబెట్టింది. చివర్లో లూసీ హామిల్టన్ (36) వేగంగా ఆడటంతో ఢిల్లీ 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్, సయాలీ సత్ఘరే తలా 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు.
.jpeg)
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అద్భుత ఆరంభం ఇచ్చారు. కెప్టెన్ స్మృతి మంధాన (96)* బౌండరీల వర్షం కురిపించింది. తృటిలో సెంచరీ మిస్ అయింది. జార్జియా వోల్ (54 నాటౌట్) మంచి సహకారం అందించింది. ఆర్సీబీ కేవలం 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి వన్ సైడెడ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క విజయంతో నాలుగో స్థానానికి పడిపోయింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!