
సినిమాలు

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, టీ20 టోర్నీ లేదా సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన యువ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. కేవలం పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది.
ముంబైతో మ్యాచ్కు ముందు 579 పరుగులతో ఉన్న వైభవ్, ఈ మ్యాచ్లో 4 పరుగులు చేసి మొత్తం 583 పరుగులకు చేరుకున్నాడు. దీంతో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ పేరిట ఉన్న 580 పరుగుల రికార్డును అధిగమించాడు. 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడిక్కల్ ఈ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!