

అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ సెమీఫైనల్కు అద్భుతంగా చేరింది. సూపర్ సిక్సెస్లో పాకిస్థాన్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (66), హంజా జహూర్ (42), ఫర్హాన్ యూసఫ్ (38) మాత్రమే పోరాడగా, భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే చెరో మూడు వికెట్లు తీశారు. అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ సాధించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ వేదాంత్ త్రివేది (68) కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ (30) దూకుడుగా ఆడగా, చివర్లో కనిష్క్ చౌహాన్ (35) మరియు ఖిలాన్ పటేల్ (21) వేగంగా పరుగులు సాధించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. సెమీఫైనల్స్లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియా–ఇంగ్లాండ్ తలపడనుండగా, ఫిబ్రవరి 4న భారత్–అఫ్గానిస్థాన్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!