

అండర్-19 ఆసియా కప్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ తరఫున హుజైఫా అహ్సన్ 70 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
భారత బ్యాటర్లలో అరోన్ జార్జి 85 పరుగులతో జట్టును ఆదుకోగా, కాన్షిక్ చౌహాన్ (46), ఆయుష్ మాత్రే (38) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అభిజ్ఞాన్ కుందు 22 పరుగులు జోడించాడు. యూఏఈతో మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. భారత బౌలింగ్లో దీపేశ్ దేవేంద్రన్, చౌహాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కిషన్ కుమార్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ చెరో వికెట్తో విజయానికి తోడ్పడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!