

తిలక్ వర్మను ఇండియా ఏ జట్టుకు కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. శ్రీలంక వేదికగా జరిగే ఇండియా ఏ, ఆఫ్ఘానిస్తాన్ ఏ, శ్రీలంక ఏ ముక్కోణపు వన్డే సిరీస్ కోసం గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రియాన్ పరాగ్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఐపీఎల్ మరియు దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న తిలక్కు ఇది కీలక బాధ్యతగా భావిస్తున్నారు.
ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీది. అండర్-19 వరల్డ్ కప్ మరియు ఐపీఎల్ 2026లో అద్భుత ఆటతో ఆకట్టుకున్న వైభవ్కు ఇదే తొలి ఇండియా ఏ పిలుపు. అతనితో పాటు పంజాబ్ యువ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభుసిమ్రాన్ సింగ్లకు కూడా చోటు దక్కింది. మే 31న ఐపీఎల్ ముగిసిన వెంటనే జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో వైభవ్ ఎలా రాణిస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దుబే, సూర్యాంష్ షెడ్జ్, ప్రభుసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యుద్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!