

టీమ్ ఇండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు 2027 అక్టోబర్–నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రా ఫిట్నెస్ను జాగ్రత్తగా కాపాడాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. అందుకే వచ్చే 18 నెలల్లో అతడిని టీ20ల కంటే వన్డే మ్యాచ్ల్లో ఎక్కువగా ఆడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. జాతీయ సెలక్షన్ కమిటీ, వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, అలాగే టీమ్ మేనేజ్మెంట్ కలిసి బుమ్రా పనిభారం నిర్వహణపై ప్రత్యేక బ్లూప్రింట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మ్యాచ్ల విషయంలో మాత్రం బుమ్రా రాజీపడే అవకాశమే లేదు. బీసీసీఐ అధికారి ప్రకారం, భారత జట్టు కోసం బుమ్రా ఫిట్నెస్ అత్యంత కీలకం. ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలింగ్ దళంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రధాన సభ్యులుగా ఉన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!