

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆరంభం నుంచే తడబడి నిర్ణీత ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. కీలక బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ త్వరగా ఔటవడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది.
.jpeg)
ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా, డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో జట్టును నిలబెట్టగా, డెవాల్డ్ బ్రెవిస్ 45 పరుగులు చేశారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 44 నాటౌట్తో వేగంగా ఆడటంతో జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసి రికార్డు సృష్టించగా, లక్ష్య ఛేదనలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కుదేలు చేశాడు. శివం దూబే 42 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!