

భారత హాకీ స్టార్ మన్ప్రీత్ సింగ్ రాబోయే ప్రపంచకప్ తన కెరీర్లో చివరిది కావచ్చని చెప్పాడు. ఇది తనకు నాలుగో ప్రపంచకప్ అని, అందుకే చివరి అవకాశంగా భావించి బరిలోకి దిగుతానని తెలిపాడు. ఒలింపిక్స్లో భారత్ పతకాలు సాధించినప్పటికీ ప్రపంచకప్లో ఇప్పటివరకు మెడల్ గెలవలేకపోయిందని, ఈసారి ఆ లోటును భర్తీ చేయడమే జట్టు లక్ష్యమని పేర్కొన్నాడు.
జట్టులో అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, సన్నద్ధత కూడా బాగా సాగిందని మన్ప్రీత్ చెప్పాడు. ఫిట్నెస్తో పాటు గోల్స్ చేయడం, డిఫెన్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపాడు. ప్రపంచకప్ పూల్-డిలో భారత్తో పాటు వేల్స్, ఇంగ్లండ్, పాకిస్థాన్ ఉన్నాయి. ఆగస్టు 15న వేల్స్తో, ఆగస్టు 17న ఇంగ్లండ్తో, ఆగస్టు 19న పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. నెదర్లాండ్స్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భారత్ చివరిసారిగా 1975లో ప్రపంచకప్ స్వర్ణం సాధించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!