
జనరల్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ భుజం గాయం కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో విజయవంతంగా సర్జరీ చేయించుకున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా భుజం గాయంతో బాధపడుతున్న పరాగ్ రాబోయే దేశీయ టోర్నీలకు దూరం కానున్నాడు.
ఇప్పుడు అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహ్యాబ్ ప్రారంభించనున్నాడు. 2026–27 దేశీయ సీజన్లోని ముఖ్యమైన టోర్నీలకు అతను దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ను ప్లేఆఫ్స్కు తీసుకెళ్లిన పరాగ్, గాయం కారణంగా భారత్-ఎ జట్టు టోర్నీ నుంచి కూడా తప్పుకున్నాడు. సర్జరీ అనంతరం ఆయన భావోద్వేగ సందేశంలో త్వరలోనే మళ్లీ మైదానంలోకి వస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!