
గాసిప్స్

వన్డే ప్రపంచకప్ లో ఓటములు ఎదురైన విశాఖ వేదిక పైనే భారత మహిళల జట్టు ఇప్పుడు శ్రీలంక పై వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించింది. మంగళవారం జరిగిన రెండో టీ20 లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. శ్రీ చరణి, వైష్ణవి శర్మ, స్నేహ్ రాణా బౌలింగ్లో రాణించారు. లక్ష్య ఛేదనలో షెఫాలి వర్మ 69 నాటౌట్తో జట్టును సులువుగా గెలిపించింది.
ఈ సిరీస్తో భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. మరోవైపు దీప్తి శర్మ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో కెరీర్లో తొలిసారి నంబర్వన్ స్థానానికి చేరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!