

ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఆదివారం ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగే మూడో టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. ముల్లాన్పూర్లో జరిగిన రెండో టీ20 లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా, ఈ మ్యాచ్లో సిరీస్లో ఆధిక్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
రెండో మ్యాచ్లో 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్లో లేకపోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. అలాగే, బుమ్రా–అర్ష్దీప్ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ ఓటమి భారత్కు స్వదేశంలోనే అతిపెద్ద పరాజయంగా నమోదైంది.
అంచనా తుది జట్లు (Predicted XI)
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్
సౌతాఫ్రికా: రీసా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డీవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెర్రీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!