

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరియు భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొంది. స్ట్రైక్లో ఉన్న మిచెల్ వైపు అర్ష్దీప్ బంతిని విసరడంతో మైదానంలో వాతావరణం కొద్దిసేపు వేడెక్కింది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిచెల్తో మాట్లాడగా, అంపైర్ అర్ష్దీప్తో చర్చించడంతో పరిస్థితి సాధారణమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడగా, మిచెల్ను క్షమాపణలు కోరుతూ అర్ష్దీప్ వివాదానికి తెరదించాడు. అయినప్పటికీ ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై ఐసీసీ అర్ష్దీప్ సింగ్పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది.
ఈ వివాదంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. దేశం తరఫున ఆడేటప్పుడు దూకుడు అవసరమని, బౌలర్గా అర్ష్దీప్ చూపిన ఆగ్రహంలో తప్పేమీ లేదని తెలిపారు. వరుసగా రెండు సిక్స్లు ఇచ్చిన తర్వాత ఎవరైనా బౌలర్ ఇలా స్పందించవచ్చని చెప్పారు. అర్ష్దీప్ క్షమాపణలు చెప్పకపోయినా సమస్యేమీ ఉండదని, అయితే సారీ చెప్పడం మంచి చర్య అని గంభీర్ పేర్కొన్నారు. అలాగే డగౌట్లో తాను సీరియస్గా ఉండడంపై వచ్చిన విమర్శలకూ స్పందిస్తూ, జాతీయ జట్టుకు కోచ్గా ఉండటం పెద్ద బాధ్యత అని, కఠిన పరిస్థితుల్లో నవ్వుతూ ఉండటం సాధ్యం కాదని వివరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!