

భారత క్రికెట్ను ఐపీఎల్ ఎలా పూర్తిగా మార్చిందో తెలిసిందే. అదే తరహాలో మహిళల క్రికెట్లో డబ్ల్యూపీఎల్ పెద్ద మార్పుకు కారణమవుతోంది. యువ క్రికెటర్లకు వేదికగా మారిన ఈ లీగ్ ఆటలో ధైర్యం, దూకుడు, నైపుణ్యాన్ని పెంచింది. ఒకప్పుడు ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాస లోపం భారత మహిళల జట్టును వెనక్కి నెట్టేది. కీలక మ్యాచ్ల్లో తడబడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గత వన్డే ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ అద్భుతంగా ఆడి ట్రోఫీని అందుకుంది. ఆస్ట్రేలియాపై భారీ విజయాలు, సెమీఫైనల్లో రికార్డు ఛేదన, ఫైనల్ విజయం ఇవన్నీ జట్టు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ మార్పుకు డబ్ల్యూపీఎల్ ప్రధాన కారణం.
స్మృతి మంధాన, షెఫాలి వర్మ, దీప్తి శర్మ లాంటి ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. గతంలో ఓ మోస్తరు గుర్తింపు ఉన్న జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు స్టార్గా మారింది.
తెలుగమ్మాయి శ్రీ చరణి ప్రపంచ స్థాయి స్పిన్నర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.
డబ్ల్యూపీఎల్లో మెరిసిన భారత ఆటగాళ్లు బిగ్బాష్, ది హండ్రెడ్ వంటి విదేశీ లీగ్ల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రతి సీజన్తో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఆదాయం పెరుగుతోంది. వేలాల్లో అమ్మాయిలు కోటీశ్వరులవుతున్నారు. దీంతో దేశంలో క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
భవిష్యత్తులో భారత మహిళల జట్టు మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో డబ్ల్యూపీఎల్ కీలక పాత్ర పోషిస్తుందన్నది స్పష్టం అవుతుంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!