

ఆసియా క్రీడలు-2026లో క్రికెట్ షెడ్యూల్ ఖరారైంది. జపాన్ వేదికగా జరగనున్న ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించనున్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు సెప్టెంబర్ 18న ఆతిథ్య జపాన్తో క్వార్టర్ఫైనల్లో తలపడనుంది. మహిళల టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 22న జరగనుంది. గత ఆసియా క్రీడల్లో క్రికెట్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత్.. ఈసారి కూడా టైటిల్పై కన్నేసింది.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 28న తన ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. గ్రూప్-ఎలో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్ జట్లు ఉండగా.. అందులో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ క్వార్టర్ఫైనల్ ఆడుతుంది. పురుషుల సెమీఫైనల్స్ అక్టోబర్ 1న, కాంస్య పతక పోరు, ఫైనల్ అక్టోబర్ 3న జరగనున్నాయి. పురుషుల విభాగంలో భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్ఫైనల్కు అర్హత సాధించాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!