

ఆంధ్రప్రదేశ్ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చామల ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్–2 కు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లకు విశేష ఆదరణ దక్కగా, అప్పటి ప్రైజ్ మనీని దేశం కోసం ప్రాణాలు అర్పించిన రెండు తెలుగు రాష్ట్రాల జవాన్లకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భారీ టోర్నమెంట్ను 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.
జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొని కార్యక్రమానికి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు. యువతలో డ్రగ్స్ వ్యసన నివారణ, రైతు కుటుంబాలకు చేయూత, అమర జవానుల కుటుంబాలకు మద్దతు వంటి సేవా కార్యక్రమాలను క్రీడలతో అనుసంధానం చేయడాన్ని ఆయన ప్రశంసించారు. టాలీవుడ్ తండర్స్, బుల్లితెర రేంజర్స్ సహా ఏడు జట్లు పాల్గొనే ఈ లీగ్ రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త ఊపు తీసుకువస్తుందని, యువతను సానుకూల దిశగా నడిపించడమే ECL ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!