

వెస్ట్ బెంగాల్తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ యువ ఓపెనర్ అమన్ రావు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అమన్ 200 పరుగులు నాటౌట్గా నిలిచి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. డబుల్ సెంచరీని సిక్సర్తో పూర్తి చేయడం అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
అమెరికాలో జన్మించి, హైదరాబాద్లో పెరిగిన అమన్ రావు తన కెరీర్లో ఆడిన మూడో లిస్ట్-ఎ మ్యాచ్లోనే తొలి శతకాన్ని ద్విశతకంగా మార్చడం విశేషంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన ఆత్మవిశ్వాసం క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది.
మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్, షాబాజ్ అహ్మద్ వంటి బౌలర్ల పై అమన్ ఆధిపత్యం చెలాయించాడు. 12 ఫోర్లు, 13 సిక్సర్లతో ఇన్నింగ్స్ను అలంకరించిన ఈ 21 ఏళ్ల యువకుడు హైదరాబాద్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు.
ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో నమోదైన 9 వ డబుల్ సెంచరీగా నిలవగా, ఈ సీజన్లో ఒడిశా బ్యాటర్ స్వస్తిక్ సమాల్ తర్వాత రెండొందలు సాధించిన ఆటగాడిగా అమన్ నిలిచాడు. అతడి ఇన్నింగ్స్తో హైదరాబాద్ 50 ఓవర్లలో 352/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తర్వాత బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ (4/48) నేతృత్వంలో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా వెస్ట్ బెంగాల్ను కట్టడి చేసిన హైదరాబాద్ జట్టు 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో హైదరాబాద్కు ఇది రెండో విజయంగా నమోదు కావడం గమనార్హం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!