

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సెప్టెంబరులో జరగనున్న మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ప్రకటించిన ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్లు జరగాల్సి ఉంది. స్వదేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా అఫ్గానిస్థాన్ చాలాకాలంగా భారత్ వేదికగా తన హోమ్ సిరీస్లను నిర్వహిస్తోంది. ఈ సిరీస్కు అఫ్గానిస్థాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది.
ఈ నేపథ్యంలో షెడ్యూల్లో మార్పు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. తొలి లేదా రెండో టీ20ను సెప్టెంబరు 14న నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో స్టేడియానికి ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని అఫ్గాన్ బోర్డు అంచనా వేస్తోంది. అలాగే టీవీ, డిజిటల్ వీక్షణలు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే బీసీసీఐ ఆమోదం లభిస్తేనే షెడ్యూల్లో మార్పు జరుగుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!