

బిగ్బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం బిగ్బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో బిందు మాధవి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు అభిజిత్, నవదీప్ కూడా జడ్జీలుగా ఉన్నారు. ఈ షోలో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జే.. బిగ్బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన గొడవను ప్రస్తావించాడు.
ఆ సమయంలో నామినేషన్స్లో బిందు మాధవిని సూర్పణక అంటూ నటరాజ్ మాస్టర్ బాణం విసురుతున్నట్టు చేసిన ఘటనను గుర్తు చేస్తూ.. అప్పుడెలా ఫీల్ అయ్యారని ఆర్జే ప్రశ్నించాడు. దీనికి బిందు మాధవి తాను చాలా ఇరిటేట్ అయ్యానని, అయితే అలాంటి వాళ్లు కూడా ఉండాలని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నటరాజ్ మాస్టర్ తీవ్రంగా స్పందించారు. ‘అలాంటోళ్లు’ అంటూ బిందు చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే చేసినవేనని అన్నారు. బిగ్బాస్ తర్వాత తామిద్దరం ఆ విషయాన్ని మర్చిపోయామని, తాను బిందు మాధవిని తన కుమార్తె పుట్టినరోజుకు కూడా పిలిచానని గుర్తు చేశారు. అయితే తన గురించి అలా మాట్లాడటాన్ని మాత్రం అంగీకరించనని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ బిందు మాధవిని మాట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!