

‘నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు పొందిన నందన ప్రస్తుతం వీసా మోసం కేసులో న్యాయపరమైన విచారణను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అలాగే వీసా రెన్యూవల్స్ పేరుతో కూడా డబ్బులు సేకరించినట్టు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో నందన దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్కు తిరిగి వచ్చిన నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 16న జరగనుంది.
ఇదిలా ఉండగా, నందన బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ ఎంట్రీ కోసమే ఆమె భారత్కు తిరిగి వచ్చారని, ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కారని కొన్ని కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. అయితే నందన బిగ్బాస్ హౌస్లోకి ప్రవేశించనున్నారనే విషయంపై షో నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ప్రచారంపై కాంగ్రెస్ నాయకురాలు సంధ్యా రెడ్డి తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఒక ఇంటర్వ్యూలో ఆమె బిగ్బాస్ నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునను హెచ్చరించారు. తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రముఖ రియాలిటీ షోలో వేదిక కల్పిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. నందన ఎంట్రీ నిజమైతే దీనిపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తామని కూడా ఆమె హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నందనపై కొనసాగుతున్న న్యాయపరమైన వ్యవహారంతో పాటు బిగ్బాస్ ఎంట్రీ ప్రచారం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!