

మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమునాం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు రాజధాని ఇంఫాల్లోని రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ చేత.. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్.డిఖో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలనను ఇవాళ(ఫిబ్రవరి 04న) ఎత్తివేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిగా యుమునాం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఖేమ్చంద్ సింగ్ను ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఎన్నుకున్నారు. ప్రస్తుత సీఎం ఖేమ్చంద్ సింగ్.. 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు. ఆ తర్వాత బీరెన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని మైతేయిలు, కుకీలు, నాగాలతో ఖేమ్చంద్కు సన్నిహిత సంబంధాలున్నాయి.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!