

సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం తనను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2017లో 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లామని జగన్ తెలిపారు. బాధిత కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని చెప్పారు. సీబీఐ దర్యాప్తుకు కూడా ఆదేశించామని గుర్తుచేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. సిట్ నివేదికలు, డీఎన్ఏ ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ వనరుల కొరత పేరుతో విచారణలో జాప్యం జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తి న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!