
రాజకీయాలు

మాజీ మంత్రి ముద్రగడకు సంబంధించిన వ్యవహారంపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి బహిరంగ లేఖ విడుదల చేస్తూ పలు ప్రశ్నలు సంధించింది. ముద్రగడ బతికున్నప్పుడు రాజకీయంగా వేధింపులకు గురిచేశారని, మరణించిన తర్వాత కూడా అదే అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారా అని సమితి ప్రశ్నించింది.
అలాగే, ఆయన సొంత కుమార్తెతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించిందెవరు? ప్రభుత్వ లాంఛనాల పేరుతో రాజకీయాలు చేసిందెవరు? అని నిలదీసింది. మాజీ మంత్రికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడం అనేది భిక్ష కాదని, అది ప్రభుత్వ సంప్రదాయంలో భాగమని కాపు రిజర్వేషన్ పోరాట సమితి స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!