
గాసిప్స్

తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం, బీజేపీ–జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించబోతోందని అంచనా వెలువడింది. 243 స్థానాల్లో ఎన్డీఏకి 133 నుండి 159 సీట్లు లభించే అవకాశం ఉందని, మహాగఠబంధన్ (ఆర్జేడీ ఆధ్వర్యంలోని కూటమి) 75 నుండి 101 సీట్లు సాధించవచ్చని నివేదిక చెబుతోంది. ఇతర చిన్నపార్టీలు 2 నుండి 13 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.
ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ 122 స్థానాల మెజార్టీ మార్క్ను సులభంగా దాటే అవకాశముంది. ఓట్ల శాతంలో ఎన్డీఏ కూటమికి మహాగఠబంధన్పై సుమారు 8.3 శాతం ఆధిక్యం ఉంటుందని విశ్లేషణలో పేర్కొంది. మొత్తం మీద, ఈ ఫలితాలు బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!