

మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ నాంపల్లి CBI కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ప్రస్తుతం తాడేపల్లిలోని తన నివాసంలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కొడాలి నాని, పెర్ని నాని, వల్లభనేని వంశీలను కలుసుకుని కొద్ది సేపు సమావేశమయ్యారు. పెర్ని నాని పెద్దగా మార్పులేకుండా కనిపించగా, మిగతా ఇద్దరి రూపంలో వచ్చిన మార్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
కొడాలి నాని గణనీయంగా బరువు తగ్గి, తన పూర్వపు లుక్కు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు. అలాగే వల్లభనేని వంశీ కూడా పూర్తిగా తెల్లజుట్టుతో, పాత ఆకర్షణను కోల్పోయిన రూపంలో కనిపిస్తున్నారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఈ ముగ్గురు నాయకులు చాలా దూకుడు మరియు ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. అయితే ఎన్నికల ఓటమి తరువాత ఆ దూకుడూ, గర్జన కూడా తగ్గిపోయినట్లు ఒక న్యూట్రల్ సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యానించారు.
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!